Fire Breaks out in Delhi Metro: రోజు రద్దీగా ఉండే ఢిల్లీ మెట్రో రైలులో మంటలు రావడం కలకలం రేపింది. సోమవారం సాయంత్రం వైశాలి ప్రాంతానికి వెళ్లే మెట్రో రైలు రాజీవ్ చౌక్ స్టేషన్లో ఆగినప్పుడు రైలు కోచ్ రూఫ్పై మంటలు వచ్చాయి. అయితే దీనిని గమనించిన ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి.
అయితే ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్ స్పందించింది. వైశాలి రూట్లో వెళుతున్న మెట్రో రైలుపై భాగంలో మంటలు వచ్చాయని తెలిపారు. ఈ ఘటన రాజీవ్ చౌక్ స్టేషన్ వద్ద సాయంత్రం 6.21 గంటలకు జరిగిందని పేర్కొన్నారు. అయితే ఈ ఘటన అంత ప్రమాదకరమైనదేమీ కాదని తెలిపారు.
రైలు రూఫ్పై వేలాడే విద్యుత్ తీగలు, వాటి నుంచి విద్యుత్ ప్రవాహాన్ని గ్రహించేందుకు ఉండే ఫాంటో గ్రాఫ్ల మధ్య ఏదైనా చిక్కుకుంటే స్వల్ప స్థాయిలో మంటలు వస్తాయని అన్నారు. దీని వల్ల ఎటువంటి భద్రత ముప్పు కానీ .. ప్రయాణికులు ప్రాణాపాయం కానీ ఉండదని తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన ఖచ్చితమైన కారణాలపై దర్యప్తు చేపడతామని ఢిల్లీ మెట్రో రైలు కార్పోరేషన్
వెల్లడించారు.
Also Read: Shibu Soren: ఓ వైపు పార్టీ.. మరోవైపు కోడలు.. మధ్యలో నలిగిపోతున్న మామ
#WATCH | In reference to a viral video in which a minor fire is seen emanating from the roof of a train, this is to clarify that the incident pertains the to a train at Rajiv Chowk station heading towards Vaishali around 6:21 pm today: DMRC
The extant incident was the case of… pic.twitter.com/i8To6qXgha
— ANI (@ANI) May 27, 2024