EPAPER

Railway Station: రైల్వే స్టేషన్‌లో మంటలు.. దుకాణాలు దగ్దం.. ప్రయాణికుల పరుగులు

Railway Station: రైల్వే స్టేషన్‌లో మంటలు.. దుకాణాలు దగ్దం.. ప్రయాణికుల పరుగులు

Fire Accident: పశ్చిమ బెంగాల్‌లో ఓ రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉదయం ఒక షాపులో మొదలైన మంటలు ఇతర దుకాణాలకూ వేగంగా వ్యాపించాయి. చాలా వరకు షాపులు దగ్దమయ్యాయి. ఈ మంటలను చూసి ప్లాట్ ఫామ్ పై ఉన్న ప్రయాణికులు పరుగు పెట్టారు. ఈ ఘటన దక్షిణ 24 పరగణాల జిల్లాలోని గుటియారి షరీఫ్ రైల్వే స్టేషన్‌లో ఆదివారం జరిగింది.


గుటియారి షరీఫ్ రైల్వే స్టేషన్‌లో ప్లాట్ ఫామ్ నెంబర్ 1 పైన ఉన్న ఓ షాపులో ఈ రోజు ఉదయం  10.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అవి వెంటనే ఇతర ప్లాట్ ఫామ్‌లపై గల దుకాణాలకు వ్యాపించాయి. అప్పుడు ట్రైన్ కోసం ప్లాట్ ఫామ్‌లపై ఎదురుచూస్తున్న ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. ఈ మంటల గురించి రైల్వే పోలీసులు, బ్రిగేడ్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు వెంటనే రంగంలోకి దిగారు. మంటలను ఆర్పే పనిలో పడ్డారు.

Also Read: RTC Bus: తీవ్ర విషాదం.. వాగు-రోడ్డు మధ్య వేలాడుతున్న ఆర్టీసీ బస్సు.. ఆర్తనాదాలు చేస్తున్న ప్రయాణికులు


రెండు అగ్నిమాపక యంత్రాలు స్పాట్‌కు వచ్చారు. మంటలను అదుపులోకి తెచ్చాయి. అయితే, ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకుని సియల్డా సౌత్ సెక్షన్‌ రైళ్ల సేవలు కొంత సేపు నిలిచిపోయాయి.

Related News

Nipah virus: కేరళలో నిఫా వైరస్ విజృంభణ.. స్టూడెంట్ మృతి.. రాష్ట్రంలో ఆంక్షలు!

PM Modi: ఇది ట్రైలర్ మాత్రమే.. ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ

yashwant Sinha: వాజ్ పేయి సిద్ధాంతాలతో.. పార్టీ పేరు ప్రకటించిన యశ్వంత్ సిన్హా

Delhi: ఢిల్లీకి తదుపరి సీఎం ఎవరు? రేసులో ఆరుగురు పేర్లు.. వీళ్లేనా?

Rajasthan Road Accident: రాజస్థాన్‌లో ట్రక్కును ఢీకొట్టిన తుఫాను.. ఎనిమిది మంది దుర్మరణం

Jammu Kashmir: గాంధీ, నెల్సన్ మండేలాతో బీజేపీ పోల్చుతున్న ఈ బుఖారీ ఎవరు?

PM Narendra Modi: మరో 6 వందే భారత్ రైళ్లు.. వర్చువల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ

Big Stories

×