Bullet Train Project In India (today news telugu) :
రెండు గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్కు చేరొచ్చు. ఈ మేరకు గంటకు గరిష్ఠంగా 320 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ ట్రైన్ పరుగులు తీసేలా ఈ కారిడార్ రూపుదిద్దుకుంటోంది. ఇందులో భాగంగా బిలిమోర-సూరత్ మధ్య తొలి 50 కిలోమీటర్ల మేర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2026 నాటికి ఈ పనులు పూర్తవుతాయని నిరుడు కేంద్రం ప్రకటించింది.
ముంబై-అహ్మదాబాద్ కారిడార్ పనులు 2021 నవంబర్లో ఆరంభమై శరవేగంగా సాగుతున్నాయి. ఆ పనుల పురోగతికి సంబంధించిన వీడియోను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. అత్యంత ఆధునిక బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు గురించి వివరాలను ఆ వీడియో ద్వారా వెల్లడించారు. భవిష్యత్తు భారతంగా ఆ ప్రాజెక్టును అభివర్ణించారు కేంద్ర మంత్రి. ఈ బుల్లెట్ ట్రైన్ రూట్లో అదనంగా 24 నదీబ్రిడ్జిలను, 28 స్టీల్ బ్రడ్జిలను నిర్మిస్తున్నారు.
Read more : పీఎం సూర్య ఘర్ పథకంతో ఉచిత విద్యుత్.. ‘రూఫ్టాప్ సోలార్’ దరఖాస్తు ప్రక్రియ ఇలా
భారతీయ రైల్వే తన ఆపరేషన్లను ఆరంభించే సరికి.. ఈ రూట్లో 35 బుల్లెట్ ట్రైన్లు నడుస్తాయి. ఇవి రోజుకు దాదాపు 70 ట్రిప్పులు తిరుగుతాయి.
2050 నాటికి బుల్లెట్ రైళ్ల సంఖ్యను 105కి పెంచుతారు. అప్పటికి ఏటా 1.6 కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తారని అంచనా. ఇవీ విశేషాలు..