Chhattisgarh Encounter(Today news Telugu) : తెలంగాణ – ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా వెంకటాపురం సర్కిల్ పరిధిలోని కర్రిగుట్టలు – ఛత్తీస్ గఢ్ వైపు ఉన్న కాంకేర్ బోర్డర్ కర్రెగుట్టలో ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. ఘటనా ప్రాంతం నుంచి పోలీసులు.. తుపాకులు, పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Also Read : రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్.. నిందితులతో సంబంధం ఉన్న బీజేపీ కార్యకర్త అరెస్ట్..
18 రోజుల వ్యవధిలో 21 మంది మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో మరణించారు. మార్చి 19న ఛత్తీస్ గఢ్ – మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి అటవీ ప్రాంతంలో పోలీసులు – మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. మార్చి 27న బీజాపూర్ – సుక్మా సరిహద్దు ప్రాంతమైన బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీపుర్ భట్టి ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో డిప్యూటీ కమాండర్ సహా ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు.
ఏప్రిల్ 2న జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ జిల్లా పొర్చెలి అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.