Elon Musk : వివాదాల్లో ముందు వరుసలో ఉండే ఎలన్ మస్క్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ట్విట్టర్ హెడ్ క్వార్టర్స్లో ఉద్యోగుల కోసం బెడ్రూమ్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో దీనిపై వివాదం నెలకొంది. ట్విట్టర్ హెడ్క్వార్టర్స్లో బెడ్రూమ్స్ ఏర్పాటు చేయడంపై దర్యాప్తు చేయనున్నట్లు శాన్ఫ్రాన్సిస్కో మేయర్ లండన్ బ్రీడ్ తెలిపారు. ఈ నేపథ్యంలో మస్క్ దీనిపై స్పందించారు.
మేయర్పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు ఎలన్ మస్క్. ”ముందు తమరు పిల్లలు వాడుతున్న డ్రగ్స్ సంగతిని పక్కనబెట్టి.. మా ఉద్యోగుల విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన పడకల మీద పడ్డారన్నమాట…” అంటూ ట్వీట్ చేశాడు మస్క్. ఈ ట్వీట్కు ఓ వార్తా కథనాన్ని కూడా మస్క్ జోడించడం గమనార్హం. గతంలో ఉద్యోగులు నిద్రాహారాలు మాని పని చేయాలని చెప్పిన ఎలన్ మస్క్ తాజాగా ఉద్యోగుల కోసం హెడ్ ఆఫీసులో బెడ్లు కూడా ఏర్పాటు చేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.