Elon Musk: త్వరలో టెస్లా భారత్కు రానుంది. ఎలాన్ మస్క్ ప్రధాని మోదీతో భేటీ తర్వాత ఈ విషయం స్పష్టం చేశారు. భారత్ లో టెస్లా కార్యకలాపాలు వీలైనంత త్వరగా ప్రారంభమవుతాయన్నారు. ఈ విషయంలో మోదీ నుంచి మంచి మద్దతు లభిస్తోందన్నారు మస్క్.
అమెరికా పర్యటనలో ఉన్న మోదీ ఎలాన్ మస్క్తో భేటీ అయ్యారు. భారత్ లో పెట్టుబడులు, టెక్నాలజీ విషయంలో సహాయం తదితర అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. మోదీతో మీటింగ్ తర్వాత మాట్లాడిన ఎలన్ మస్క్, తాను మోదీకి అభిమానినని చెప్పారు. సమావేశం చాలా ఉత్సాహ పూరిత వాతావరణంలో జరిగిందన్న మస్క్.. త్వరలో భారత్లో పర్యటించనున్నట్లు ప్రకటించారు.