Election Results 2023: నాలుగు రాష్ట్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణలోని చాంద్రాయణగుట్టలో పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ముందంజలో ఉన్నారు. కామారెడ్డిలో బీజేపీ లీడింగ్ లో ఉంది. తెలంగాణ పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో బీఆర్ఎస్ 21, కాంగ్రెస్ 26, ఎంఐఎం 1 స్థానంలో ఆధిక్యంలో ఉంది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో కాంగ్రెస్ – బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ జరుగుతోంది. మధ్యప్రదేశ్ లో బీజేపీ 58, కాంగ్రెస్ 48 లీడింగ్ లో ఉండగా.. రాజస్థాన్ లో బీజేపీ 46 స్థానాల్లో, కాంగ్రెస్ 42 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఛత్తీస్ గఢ్ లో బీజేపీ 20 స్థానాల్లో, కాంగ్రెస్ 22 స్థానాల్లో లీడింగ్ లో ఉంది.