Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్ కేసు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను వదలడం లేదు. ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. జనవరి 3న విచారణకు హాజరు కావాలని పిలుపునిచ్చింది. ఇప్పటికే ఆయనకు రెండు సార్లు సమన్లు జారీ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ పలు కారణాలతో విచారణకు హాజరు కాలేదు. ఎన్నికల ప్రచారంలో ఉన్నందున మొదటిసారి సమన్లు ఇచ్చినప్పుడు విచారణకు రాలేనన్న కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
ఈనెల 19న రెండోసారి సమన్లు ఇచ్చిన ఈడీ 21న విచారణకు హాజరుకావాలని తెలిపింది. అనారోగ్య కారణాలతో హాజరుకాలేక పోతున్నట్లు కేజ్రీవాల్ ఈడీకి సమాచారం అందించారు. జనవరి 3న విచారణకు రావాలని మూడోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది.