కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి పనౌతీ అనే పదాన్ని వాడారు రాహుల్ గాంధీ. దీనిపై అభ్యంతరాలు వచ్చాయి. అలా ఎందుకు మాట్లాడారు? ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు రాదా అంటూ ఎన్నికల సంఘం వివరణ కోరింది. నవంబర్ 25 సాయంత్రం 6 గంటల్లోగా సమాధానం చెప్పాలని కోరింది.
ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి సెటైర్లు వేశారు. ఆహ్మదాబాద్ లో జరిగిన ఆస్ట్రేలియా, ఇండియా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కు మోదీ వెళ్లడాన్ని రాహుల్ ప్రస్తావించారు. మోదీని చెడు శకునంగా అభివర్ణించారు రాహుల్. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఓటమే అంటూ సెటైర్లు విసిరారు.
గెలిచే మ్యాచ్ కూడా ఇండియా ఓడిపోయిందన్నారు రాహుల్. PM అనే పదాన్ని.. పనౌతీ మోదీ అంటూ అభివర్ణించారు. హిందీలో పనౌతీ అంటే దురదృష్టం తీసుకువచ్చే వ్యక్తి అంటారు. పనౌతీ పదానికి చెడు శకునం అని అర్థం. రాహుల్ మోదీపై చేసిన కామెంట్ లో ఈ పదం వాడటంపై ఇప్పుడు ఈసీ వివరణ కోరింది.
.
.
.