EPAPER

DK Shivakumar: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. హైకోర్టులో డీకేకు ఊరట

DK Shivakumar: ఆదాయానికి మించిన ఆస్తుల కేసు.. హైకోర్టులో డీకేకు ఊరట

Relief to DK Shivakumar High Court rejects: కర్ణాటక డిప్యూటీ సీఎం, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు భారీ ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో విచారణను కొనసాగించే విషయంపై దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహరంపై డీకే శివకుమార్ విచారణను కొనసాగించాలంటూ న్యాయస్థానంలో రెండు పిటిషన్ దాఖలు అయ్యాయి.


రెండు పిటిషన్లలో ఒకటి సీబీఐ దాఖలు చేయగా..మరొకటి బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ దాఖలు చేశారు. అయితే, తాజాగా, వీటిని పరిశీలించిన ధర్మాసనం విచారణను కొనసాగించేందుకు వీలు లేదంటూ రెండు పిటిషన్లను కొట్టివేసింది. దీంతో డిప్యూటీ సీఎంకు కోర్టులో ఊరట లభించినట్లయింది.

హైకోర్టు తీర్పు అనంతరం డీకే శివకుమార్ స్పందించారు. అక్రమాస్తుల కేసులో కోర్టు నిర్ణయాన్ని దేవుడి నిర్ణయంగా భావిస్తున్నానని, నేను కోర్టు తీర్పు, దేవుడిని నమ్ముతానన్నారు.


ఇదిలా ఉండగా, 2013-18 మధ్య అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డీకే శివకుమార్ మంత్రిగా వ్యవహరించారు. ఈ సమయంలో ఆయన సంపాదనలో రూ.74కోట్లు లెక్కకు మంచిన ఆదాయం ఉందని ఆరోపణలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఆయన నివాసం, ఆఫీసుల్లో ఐటీ శాఖ సోదాలు జరిపి కొంత మొత్తాన్ని స్వాధీనం చేసుకుంది. అనంతరం ఈ వ్యవహారంలో ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తు చేపట్టింది. ఈడీ విచారణ ఆధారంగా సీబీఐ ఆయనపై 2020లో కేసు నమోదు చేసింది.

Related News

Bank Holidays: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లో భారీగా సెలవులు..ఎన్ని రోజులంటే?

Jammu Kashmir: ఓటెత్తిన కశ్మీరం.. 58.19 శాతం పోలింగ్ నమోదు

One Nation One Election: జమిలి ఎన్నికలతో ఎవరికి లాభం? దీని వల్ల కలిగే నష్టాలేమిటీ?

Jamili elections: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. జమిలి ఎన్నికలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. త్వరలోనే మళ్లీ ఎలక్షన్స్..?

Threat to Rahul Gandhi: రాహుల్ గాంధీ హత్యకు కుట్ర.. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు..

Atishi Marlena Singh: ఒకప్పటి ఆంధ్రా స్కూల్ టీచర్ ఇప్పుడు ఢిల్లీ సిఎం.. ఆతిషి రాజకీయ ప్రస్థానం

Jammu Kashmir Elections: జమ్మూ‌కాశ్మీర్‌లో మొదలైన పోలింగ్.. ఓటర్లు క్యూ లైన్.. పదేళ్ల తర్వాత, పార్టీలకు పరీక్ష

Big Stories

×