Dhoni Buys Electric Car : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి బైకులన్నా, కార్లన్నా ఎంతో మక్కువో అందరికీ తెలిసిందే. మార్కెట్లోకి ఏదైన కొత్త బైకు, కారు వచ్చిందంటే.. రోజుల వ్యవధిలో తన గ్యారేజీలోకి చేరాల్సిందే. ఇప్పటికే ధోని దగ్గర లెక్కలేనన్ని వాహనాలు ఉన్నాయి. తాజాగా దక్షిణ కొరియా కార్ల దిగ్గజం కియాకు చెందిన ఈవీ6 SUVని మహీ ఇటీవల కొనుగోలు చేశాడు. ధోని కొనుగోలు చేసిన తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం.
దీని ధర దేశీయ మార్కెట్లో 60 లక్షల రూపాయల వరకు ఉంది. ఇంకేముందు సరదాగా కాసేపు అంటూ కియా కారులో అలా రాంచి వీధుల్లో చక్కర్లు కొట్టాడు ధోని. ఒక్కడే వెళితే ఏం మజా ఉండదనుకున్నాడో ఏమో.. టీమిండియా ఆటగాళ్లు కేదార్ జాదవ్, రుతురాజ్ గైక్వాడ్ తో కలిసి కొత్త కారులో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది