Lok Sabha Elections 2024 Updates: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రేపు నాలుగో దశ పోలింగ్ జరగనున్నది. 10 రాష్ట్రాల్లోని మొత్తం 96 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనున్నది. ఈ నియోజకవర్గాల నుంచి 1,717 మంది పోటీ చేస్తున్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి అత్యధికంగా 45 మంది పోటీ చేస్తున్నారు. ఈ దశలో పలువురు కీలక నేతలు పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలో 11 స్థానాలకు పోలింగ్ రేపు జరగనున్నది. ఈ స్థానాల నుంచి ముఖ్య నేతలు బరిలో ఉన్నారు. మొత్తం 298 మంది పోటీ చేస్తున్నారు.
మహారాష్ట్రలోని జల్నా, ఔరంగాబాద్, శివ్ నేరీ శిరూర్, షిరిడీ, నందుర్బార్, మావల్, జల్ గావ్, అహ్మద్ నగర్, రావెర్ తోపాటు మొత్తం 11 స్థానాలకు రేపు ఎన్నికల పోలింగ్ జరగనున్నది. ఈ స్థానాల్లో మొత్తం 298 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.