Nirmala Sitharaman: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్. తమిళ బ్రాహ్మిణ్ ఆమె. అంతపెద్ద పదవిలో ఉన్నా.. చాలా సింపుల్గా ఉంటారు. నిర్ణయాలు, రాజకీయ విమర్శలు మాత్రం చాలా పదునుగా ఉంటాయ్. తాజాగా, తన కూతురు వాజ్ఞ్మయి వివాహాన్ని చాలా చాలా సింపుల్గా జరిపించారు. బెంగళూరులోని తన ఇంట్లోనే వివాహ వేడుక. అత్యంత సన్నిహితులకే ఆహ్వానం. రాజకీయ నేతలు, వీవీఐపీలు ఎవరినీ పిలవలేదు. అధికార దర్పం ఏమాత్రం ప్రదర్శించలేదు.
నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ల కూతురే వాజ్ఞ్మయి. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ లిటరేచర్లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. అమెరికా, నార్త్వెస్టర్న్ యూనివర్సిటీలో జర్నలిజం చేశారు. ప్రస్తుతం ప్రముఖ వార్తా సంస్థకు ఫీచర్ రైటర్, కాలమిస్ట్గా చేస్తున్నారు.
ఇక, వాజ్ఞ్మయిని పెళ్లాడిన ప్రతీక్ దోషీ ఎవరనే దానిపై ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. గుజరాత్కు చెందిన ప్రతీక్.. ప్రధాని మోదీకి అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. పీఎంవోలో కీలక అధికారిగా పని చేస్తున్నారు. జాయింట్ సెక్రటరీ హోదాలో ఓఎస్డీ (రీసెర్చ్ & స్ట్రాటజీ)గా ఉన్నారు. ప్రధానికి లెఫ్ట్, రైట్ ఆయనే అంటారు.
మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు సైతం.. సీఎంవోలో రీసెర్చ్ అసిస్టెంట్గా ఉండేవారట ప్రతీక్ దోషీ. మోదీతో సుదీర్ఘ అనుబంధం ఆయనది. సింగపూర్ మేనేజ్మెంట్ స్కూల్లో ప్రతీక్ ఎంబీఏ చేసినట్టు తెలుస్తోంది.