Brij Bhushan : బీజేపీ ఎంపీ, మాజీ భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమపై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆయనపై మహిళా రెజ్లర్లు ఆరోపణలు చేయడంతో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు ఛార్జిషీట్ దాఖలు చేశారు. బ్రిజ్ భూషణ్ వేధింపులకు పాల్పడినట్టు పేర్కొన్నారు.
నేరం రుజువైతే బ్రిజ్ భూషణ్ కు 5 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. మొత్తం 180 మందిని విచారణ జరిపి ఛార్జిషీట్ తయారు చేశామని వెల్లడించారు. శుక్రవారం ఢిల్లీ కోర్టు బ్రిజ్ భూషణ్కు సమన్లు జారీ చేసింది. ఈ కేసును విచారించడానికి తగిన సాక్ష్యాలు ఉన్నాయని స్పష్టం చేసింది. జూలై 18న కోర్టు ముందు హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.
మైనర్తో సహా ఏడుగురు రెజ్లర్లు తమను బ్రిజ్ భూషణ్ లైంగికంగా వేధించారని ఫిర్యాదు చేశారు. ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా చాలారోజులపాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు తెలిపారు. పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవం రోజున ర్యాలీ నిర్వహించేందుకు యత్నించారు. అయితే పోలీసులు వారిని కస్టడీలోకి తీసుకున్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ను కలిసిన తర్వాత తమ నిరసనను విరమించారు. జూన్ 15లోగా ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేస్తామని ఠాకూర్ వారికి హామీ ఇచ్చారు.