Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ కేసు ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ను వదలడం లేదు. ఆయనకు మరోసారి నోటీసులు జారీ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఈనెల 21న ఈడీ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే మెడిటేషన్ కోసం 10 రోజులు వెళ్లనున్నట్లు రెండు రోజుల క్రితం ప్రకటించారు అరవింద్ కేజ్రీవాల్.
దీంతో ఆయన ఈడీ విచారణకు హాజరవుతారా? లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. దాదాపుగా ఆయన విచారణకు హాజరుకాకపోవచ్చంటున్నాయి పార్టీ వర్గాలు. గతంలో అక్టోబర్ 30న కూడా కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసింది ఈడీ. అయితే ఆయన గతంలోనూ విచారణకు హాజరు కాలేదు.