Delhi Crimes : ఢిల్లీలో నేరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. 10 ఏళ్ల క్రితం నిర్భయ లాంటి ఘటనలో ఇప్పటి వేలల్లో రిపీట్ అయి ఉంటాయి. శ్రద్ధా వాకర్ దారుణ హత్య కేసు మరువక ముందే మరో కేసు వెలుగులోకి వచ్చింది. ఈ రోజు ఉదయం ఓ బాలుడు తాను చదువుతున్న పాఠశాలలోని బాలిక పైన యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు బాలికను సఫ్దార్జంగ్ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు.
బాలికపై బాలుడి యాసిడ్ దాడి దృష్యాలు కెమెరాకు చిక్కాయి. అయితే బాలుడి ఎందుకు ఆ బాలికపై యాసిడ్ దాడి చేసాడనే వివరాలు తెలియాల్సిం ఉంది. బాలుడి నిజంగా అదే పాఠశాలో చదువుతున్నాడా..? లేక వేరే పాఠశాలలో చదువుతున్నాడా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.
యాసిడ్ ముఖంపైన చల్లడంతో ముఖంతో పాటు కళ్లల్లోకి కూడా యాసిడ్ వెళ్లిందని బాధితురాలి తండ్రి మీడియాకు వివరించాడు. ఇద్దరు యువకులు హెల్మెట్ ధరించి బైక్ పై వెళ్తుండగా.. అటుగా నడుచుకుంటూ వెళ్తున్న బాలికపై యాసిడ్తో తెగబడ్డారు. యాసిడ్ దాడి జరగ్గానే బాలిక భరించలేని నొప్పితో పరుగులు తీసిన దృష్యం కూడా సీసీటీవీలో రికార్డ్ అయింది.
ఈ యాసిడ్ దాడిపై ఢిల్లీ మహిళా చైర్ పర్సన్ స్వాతి మలివల్ ఘాటుగా స్పందించారు. యాసిడ్ అమ్మకాన్ని ఎందుకు నిలిపివేయకూడదు..ప్రభుత్వాలు ఇంకా ఎప్పుడు మేల్కొంటాయని ఆమె ఆవేదనతో ట్వీట్ చేశారు.