EPAPER

Bihar Bank Robbery | బిహార్ బ్యాంక్ దోపిడీ.. పోలీసులకు ఝలక్ ఇచ్చిన దొంగలు!

Bihar Bank Robbery | సాధారణంగా బ్యాంకులో దోపిడి జరిగే ఘటనలను ఎక్కువగా సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. బ్యాంకులోకి మారణాయుధాలతో దొంగలు ప్రవేశించడం.. లోపల ఉన్న సిబ్బందిని, ప్రజలను బెదిరించడం.. డబ్బు ఎత్తుకెళ్లడం జరిగిపోతుంటాయి. ఆ తరువాత కొన్ని సందర్భాలలో పోలీసులు చాకచక్యంగా దొంగలని పట్టుకొని అరెస్ట్ చేయడం వంటివి జరుగుతుంటాయి.

Bihar Bank Robbery | బిహార్ బ్యాంక్ దోపిడీ.. పోలీసులకు ఝలక్ ఇచ్చిన దొంగలు!

Bihar Bank Robbery | సాధారణంగా బ్యాంకులో దోపిడి జరిగే ఘటనలను ఎక్కువగా సినిమాల్లోనే చూస్తూ ఉంటాం. బ్యాంకులోకి మారణాయుధాలతో దొంగలు ప్రవేశించడం.. లోపల ఉన్న సిబ్బందిని, ప్రజలను బెదిరించడం.. డబ్బు ఎత్తుకెళ్లడం జరిగిపోతుంటాయి. ఆ తరువాత కొన్ని సందర్భాలలో పోలీసులు చాకచక్యంగా దొంగలని పట్టుకొని అరెస్ట్ చేయడం వంటివి జరుగుతుంటాయి. ఈ తరహా ఘటన ఇప్పుడు బీహార్ లోని అర్రాలో జరిగింది. అయితే చివర్లో మాత్రం ఊహించని ట్విస్ట్ ఇచ్చారు దొంగలు.


అర్రాలోని సర్క్యూట్ హౌస్ రోడ్‌లో గల యాక్సిస్ బ్యాంక్ లోకి ఈరోజు ఉదయాన్నే పది గంటల సమయంలో ఐదుగురు దుండగులు ఆయుధాలతో ప్రవేశించారు. ఆ తర్వాత ఆయుధాలతో సిబ్బందిని భయపెడుతూ అందర్నీ ఒక గదిలో బంధించారు. ఇక ప్లాన్ ప్రకారం… బ్యాంకు కౌంటర్లో ఉంచిన 16 లక్షల నగదును తీసుకుని కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే అక్కడి నుంచి ఉడాయించారు.

అయితే బ్యాంకు సిబ్బంది మాత్రం దొంగలు ఇంకా బ్యాంకులోనే ఉన్నారని భావించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు….బయటి నుంచి బ్యాంకును చుట్టుముట్టారు. ఫైరింగ్ జరిగే అవకాశం ఉందనే అనుమానంతో ప్రజలను అక్కడి నుంచి తరలించి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, గన్ లతో రెడీ అయ్యారు. సుమారు గంటన్నర పాటు దొంగలను లొంగిపోవాలని.. లేదంటే కాల్పులు జరుపుతామని హెచ్చరించారు. కానీ వారి నుంచి ఎటువంటి కదలిక లేకపోవడంతో చాకచక్యంగా లోపలికి ప్రవేశించిన పోలీసులు…..ఉద్యోగులను సురక్షితంగా బయటికి తీసుకు వచ్చారు. కానీ అప్పటికే దొంగలు తప్పించుకున్నారని.. గుర్తించిన పోలీసులు.. సిబ్బంది సమాచారంతో పొరబడినట్లు గుర్తించారు.


పోలీసులు బ్యాంకు బయట గంటన్నర పాటు వేచి ఉన్న సమయాన్ని దొంగలు సద్వినియోగం చేసుకుని పారిపోయినట్లు వెల్లడించారు. దోపిడీ సమయంలో సిబ్బందికి ఎటువంటి హాని జరగలేదని.. బ్యాంక్ లాకర్ కూడా భద్రంగా ఉందని భోజ్ పూర్ ఎస్పీ ప్రమోద్ కుమార్ తెలిపారు. నేరస్థుల ఫోటోలు, వీడియోలు లభించాయని.. వారిని అరెస్టు చేయడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. బయటకు వెళ్లే సమయంలో అగంతకులు బ్యాంకు ప్రధాన గేటు సీసీ కెమెరాను పగులగొట్టినట్లు తెలుస్తోంది.

Related News

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Jammu and Kashmir Assembly Polls: జమ్మూకాశ్మీర్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Mumbai times tower: ముంబై.. మంటల్లో టైమ్స్ టవర్, భారీగా నష్టం

Big Stories

×