Congress Record in Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత హస్తం పార్టీ 12 కోట్ల ఓట్లను పొందింది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం తగ్గగా.. హస్తం పార్టీకి ఓట్ షేర్ భారీగా పెరిగింది. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో 13. 63 కోట్ల ఓట్లను పొందింది.
లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఎన్టీఏకు మెజారిటీ సీట్లు దక్కడం వల్ల ప్రభుత్వం ఏర్పాటుకు మరో సారి సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి, ఎన్డీఏ మధ్య హోరా హోరీ పోటీ జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రికార్డు సృష్టించింది. 1984 లోక్ సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ 12 కోట్ల ఓట్లను సాధించింది.
40 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ 12 కోట్లకు పైగా ఓట్లను పొందింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన ఎన్నికల్లో ఈ పార్టీ అత్యధిక ఓట్లు సాధించగా. మళ్లీ ఈ సార్వత్రిక ఎన్నికల్లోనే సత్తా చాటింది. దేశ వ్యాప్తంగా జరిగిన 2024 ఎన్నికల్లో 64.21 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అయితే అందులో కాంగ్రెస్ 13.63 కోట్ల ఓట్లను సాధించింది.
ఇదిలా ఉంటే.. గత ఎన్నికల తో పోలిస్తే బీజేపీ ఓట్ల శాతం ఈ సారి తగ్గింది. అదే సమయంలో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ ఓట్ల శాతాన్ని పెంచుకున్నాయి. కానీ 2019 ఎన్నికల కంటే బీజేపీ ఈ సారి ఎక్కువ సీట్లలో పోటీ చేసింది. అయినప్పటికీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. కమలం పార్టీకి లోక్ సభ ఎన్నికల్లో 0.73 శాతం ఓట్లు తగ్గాయి. ఇదే సమయంలో కాంగ్రెస్ 1.76 శాతం ఓట్లను అధికంగా సాధించింది.