Congress First List: 39 మందితో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాను విడుదల చేసింది. వయనాడ్ నుంచి మరోసారి రాహుల్ గాంధీ బరిలో దిగుతారని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఇక ఛత్తీస్ఘడ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ రాజ్నందగావ్ నుంచి లోక్ సభ బరిలో ఉండనున్నారు.
శశి థరూర్ తిరువనంతపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండనున్నారు. అలప్పుళా నుంచి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కే సీ వేణుగోపాల్.. బెంగళూరు రూరల్ నుంచి డీ కే సురేష్ పోటీ చేయనున్నారు.
మొత్తం 39 మంది అభ్యర్థుల్లో 15 మంది జనరల్ క్యాండిడేట్లు ఉండగా 24 మంది ఎస్సీ, ఎప్టీ, ఓబీసీ, మైనార్టీ అభ్యర్థులు ఉన్నారు.