Congress MP Candidates ( Today’s breaking news in India) : లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడతల వారిగా ప్రకటిస్తోంది. ఇప్పటి వరకూ 13 జాబితాలను రిలీజ్ చేసిన కాంగ్రెస్ అధిష్టానం.. తాజాగా 14వ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఆరుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. గోవా, మధ్యప్రదేశ్, దాదర్ లలో అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ నుంచి ప్రవీణ్ పాఠక్, మొరెనా నుంచి సత్యపాల్ సింగ్ సికర్వార్ లకు టికెట్ ఇచ్చింది. నార్త్ గోవా – రమాకాంత్ ఖలప్, సౌత్ గోవా – విరియాటో ఫెర్నాండెజ్, ఖాండ్వా నరేంద్ర పాటిల్, దాదర్ అండ్ నగర్ హవేలీకి అజిత్ రాంజీభాయ్ మహల్ పేర్లను ప్రకటించింది. అయితే ఈసారి గోవాకు చెందిన సిట్టింగ్ కాంగ్రెస్ ఎంపీ ఫ్రాన్సిస్కో సర్దిన్హాకు సీటు దక్కలేదు.
లోక్ సభ తొలివిడత పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుండగా.. ఏప్రిల్ 25, మే 7, 13, 20, 25, జూన్ 1న ఎన్నికలు జరగనున్నాయి. లోక్ సభ, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి.