Ajmer Clashes: రాజస్థాన్లోని అజ్మీర్లో రెండు వర్గాల మధ్య దాడులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగడంతో ప్రస్తుతం అంతా కంట్రోల్గా ఉంది.
రాజస్థాన్లోని ఆజ్మీర్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం రెండు వర్గాల ఘర్షణలు జరిగాయి. జైన సమాజ్ గ్రూపు.. రూపన్గడ్ ప్రాంతంలో భారీ భవనం నిర్మిస్తోంది. దీని వ్యవహారంపై రెండు గ్రూపుల మధ్య వివాదం కాస్త తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు.
ALSO READ: లోదుస్తుల్లో ఉండి.. కరెంట్ తీగ బాడీకి చుట్టేసుకుని.. వర్క్ ప్రెజర్ తట్టుకోలేక టెకీ ఏం చేశాడంటే?
ఈ నేపథ్యంలో ఓ యువకుడు మృతి చెందాడు. పలువురు గాయపడ్డారు. రెచ్చిపోయిన మరో వర్గం, జేసీబీలతోపాటు వాహనాలకు ధ్వంసం చేసింది, ఆపై నిప్పు పెట్టింది. ఈ వ్యవహారం తారాస్థాయికి చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.
భారీ ఎత్తున బలగాలు ఆ ప్రాంతంలో మొహరించాయి. చివరకు ఇరువర్గాల ప్రజలను శాంతింప చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలపెట్టారు. హింసకు కారణమైన ఇరువర్గాల వారిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. మృతి చెందిన వ్యక్తిని షకీల్గా గుర్తించారు.
రెండు వర్గాల మధ్య సినిమా రేంజిలో ఘర్షణ….వ్యక్తి మృతి
రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఆదివారం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఓ భవన నిర్మాణంపై ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఈ నేపథ్యంలోనే రెండు వర్గాలు కర్రలు,రాడ్లతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
ఇదే క్రమంలో… pic.twitter.com/4X4fpojIqf
— BIG TV Breaking News (@bigtvtelugu) September 23, 2024