Chhattisgarh Encounter : ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మరోసారి తుపాకుల మోత మోగింది. భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టుల శిబిరాలపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపాయి. అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు నక్సల్స్ మృతి చెందినట్టు తెలుస్తోంది.
ఘటనా స్థలంలో భారీ డంపింగ్ ను పోలీసులు గుర్తించారు. భారీగా ఆయుధాలు, వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు శిబిరాన్ని కూల్చివేశారు. రాష్ట్రంలోని బీజాపూర్ వనాంచల్ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంది. సుక్మా జిల్లాలో నక్సలైట్లు శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి.