EPAPER

Chhattisgarh elections 2023 : ఛత్తీస్‌గఢ్ లో పోలింగ్ .. చెలరేగిన హింస.. ఐఈడీ పేలుడు..

Chhattisgarh elections 2023 : ఛత్తీస్‌గఢ్ లో పోలింగ్ .. చెలరేగిన హింస..  ఐఈడీ పేలుడు..
Chhattisgarh elections 2023

Chhattisgarh elections 2023(Politics news today India):

ఛత్తీస్ గఢ్, మిజోరాంలలో నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మొదలవ్వగా.. కొద్దిసేపటికే ఛత్తీస్ గఢ్ లో పేలుడు సంభవించింది. దీంతో మొదటి విడత ఎన్నికల్లో హింస చెలరేగింది. సుకుమా జిల్లా తొండమర్కలో జరిగిన ఐఈడీ పేలుడులో సీఆర్ పీఎఫ్ జవాన్ కు తీవ్రగాయాలయ్యాయి. బాధిత జవాన్ సీఆర్పీఎఫ్ కోబ్రా 206వ బెటాలియన్ కు చెందిన ఇన్ స్పెక్టర్ శ్రీకాంత్ అని అధికారులు వెల్లడించారు.


కాగా.. నక్సల్స్ పాతిపెట్టిన బాంబుపై కాలు వేయడంతో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. నేడు అక్కడ 20 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుండగా.. వాటిలో పేలుడు జరిగిన కొంటా అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఉంది. తొలివిడత పోలింగ్ జరుగుతున్న 7 జిల్లాలు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు కావడంతో పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. బస్తర్, జగదల్ పూర్, చిత్రకోట్ లో సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా.. అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ప్రక్రియ ముగియనుంది.


Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×