12 People died in Chhattisgarh Bus Accident: ఛత్తీస్గఢ్లో రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
దుర్గ్ నుంచి ఓ ప్రైవేటు బస్సు ఉద్యోగులను మరో ప్రాంతానికి తీసుకెళ్తోంది. మంగళవారం రాత్రి ఎనిమిదిన్నర సమయంలో రోడ్డు పక్కనే ఉన్న 40 అడుగుల భారీ గుంతలో పడిపోయింది. స్పాట్లో 11 మంది మృతి చెందారు. మరొకరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్టు ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. ఘటన జరిగిన ప్రాంతం నుంచి బాధితులను రాయ్పూర్లోని ఎయిమ్స్ తరలించారు.
ఓ డిస్టిలరీ సంస్థకు చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు. ఆఫీసులో విధులు ముగించుకుని ఉద్యోగులు ఇంటికి బస్సులో వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మట్టి గని వద్ద 40 అడుగుల లోయలో పడిపోయింది బస్సు. మృతి చెందినవారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరోవైపు ఘటన విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం విజయ్ శర్మ ఎయిమ్స్కు చేరుకున్నారు. బాధితుల పరిస్థితిని వైద్యుల నుంచి అడిగి తెలుసుకున్నారు.
Also Read: Haryana: హర్యానాలో స్కూల్ బస్ బోల్తా.. ఆరుగురు విద్యార్థులు దుర్మరణం..
ఈ ఘటనపై రాష్ట్రపతి ముర్ము విచారం వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. అటు ప్రధాని మోదీ స్పందించారు. బస్సు ప్రమాదం చాలా బాధాకరమన్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ప్రార్థించారు. మరోవైపు బస్సు ప్రమాద ఘటనపై ఆ రాష్ట్రప్రభుత్వం స్పందించింది. క్షతగ్రాతులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను ఆదేశించింది.
#WATCH | Raipur: Chhattisgarh Deputy CM Vijay Sharma reaches AIIMS to meet the victims of the Durg bus accident. pic.twitter.com/kGimNRghYN
— ANI (@ANI) April 9, 2024
Prime Minister Narendra Modi tweets, "The bus accident in Durg, Chhattisgarh is extremely sad. My condolences to those who lost their loved ones in this. Along with this, I wish for the speedy recovery of the injured. Under the supervision of the state government, the local… pic.twitter.com/lVbHt6vzha
— ANI (@ANI) April 9, 2024