EPAPER

Chhatarpur Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. దైవదర్శనానికి వెళ్తూ ఏడుగురు దుర్మరణం

Chhatarpur Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. దైవదర్శనానికి వెళ్తూ ఏడుగురు దుర్మరణం

Chhatarpur road accident seven people lost their lives: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఛత్తర్‌పూర్ జిల్లాలో ఆటో ఎదురుగా ఉన్న ట్రక్కును వెనుకనుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా..ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.


స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తర్‌పూర్ రైల్వేస్టేషన్ నుంచి ఆటోలో భక్తులు బాగేశ్వర్ ధామ్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఝాన్సీ ఖజురఘో రహదారికి ఆటో చేరుకుంది. అనంతరం అధిక వేగంగా ట్రక్కను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.


మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. ఆటో డ్రైవర్ అతివేగంతో నడపడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.

Also Read: నిమోనియా.. ఎయిమ్స్‌లో చేరిన సీపీఎం కార్యదర్శి సీతారం ఏచూరి

ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ప్రేమ్ నారాయన్ కుష్వాహా తోపాటు జనార్ధన్(45), మను శ్రీవాస్తవ, నాన్హే, గోవింద్, జనార్ధన్ కుమార్తె(18)తో పాటు మరో ఒక్కరు చనిపోయారు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×