Puja Khedkar: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఏకసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. దర్యాప్తు చేసిన ఈ కమిటీ.. నివేదికను డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సల్ అండ్ ట్రైనిగ్ (డీఓపీటీ)కి సమర్పించింది. పుణెలో సహాయ కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఖేద్కర్ పై అధికార దుర్వినియోగంతోపాటు యూపీఎస్సీలో తప్పుడు పత్రాలు సర్పించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో పూజా ఖేద్కర్ ఐఏఎస్ ఎంపికను రద్దు చేస్తూ కమిషన్ నోటీసులు జారీ చేసింది.
Also Read: అందరు కాదు.. వీళ్లు మాత్రమే ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వాలి: కేంద్రం
ఇదిలా ఉంటే.. ఆమె తండ్రి ప్రభుత్వ మాజీ అధికారి దిలీప్ ఖేద్కర్ పై కూడా పలు అవినీతి ఆరోపణల కేసులు నమోదు అయ్యాయి. అదేవిధంగా ఖేద్కర్ తల్లి మనోరమ ఓ సర్పంచిని గన్ తో బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే.