EPAPER

PM Modi Visits Wayanad: వయనాడ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. ఏం చెప్పారంటే?

PM Modi Visits Wayanad: వయనాడ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. ఏం చెప్పారంటే?

PM Modi Visits Wayanad: కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కేరళకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. నిధుల కొరత లేకుండా చూస్తామంటూ ప్రధాని భరోసా ఇచ్చారు.


వయనాడ్ లో పర్యటించిన తరువాత అక్కడి పరిస్థితులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేరళ రాష్ట్రానికి అండగా ఉంటామన్నారు. కొండచరియలు విరిగిపడిన రోజే సీఎం పినరయి విజయన్ తో తాను మాట్లాడానన్నారు. ప్రకృతి విలయంలో ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోయారంటూ ఆయన పేర్కొన్నారు. ఈ విపత్తు సాధారణమైనది కాదు.. వేలాది కుటుంబాల కలలు కల్లలుగా మారాయంటూ ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ పరిస్థితిని చూశాను.. బాధితులను కలిశాను.. మృతుల కుటుంబాలకు అండంగా ఉంటామంటూ మోదీ హామీ ఇచ్చారు. వయనాడ్ లో పరిస్థితి మెరుగుపడేందుకు కేంద్రప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

Also Read: వయనాడ్‌లో ఏరియల్ సర్వే చేసిన ప్రధాని మోదీ


కాగా, కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో ప్రధాని మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. అక్కడి బాధితులను ఆయన పరామర్శించారు. ఈ విపత్తులో 300 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని వెంట సీఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, కేంద్రమంత్రి సురేశ్ గోపి, రాష్ట్ర మంత్రులు ఉన్నారు.

Tags

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×