EPAPER

Mamata Banerjee| ‘నీతి ఆయోగ్ మీటింగ్‌లో మమత మైక్ మ్యూట్ చేయలేదు’.. వివాదంపై స్పందించిన కేంద్రం

Mamata Banerjee| ‘నీతి ఆయోగ్ మీటింగ్‌లో మమత మైక్ మ్యూట్ చేయలేదు’.. వివాదంపై స్పందించిన కేంద్రం

Mamata Banerjee| ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం జరిగిన తొమ్మిదో నీతి ఆయోగ్ మీటింగ్‌ మధ్య లోనుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెళ్లిపోయారు. ఆ తరువాత అలా చేయడానికి గల కారణాన్ని మీడియా ముందు చెబుతూ.. మీటింగ్ మధ్యలో తాను మాట్లాడుతుండగానే తన మైకు మ్యూట్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ వివాదంపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ.. అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.


”ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడే సమయం మించిపోయింది. అయినా ఆమె మాట్లాడుతూనే ఉన్నారు. ఆల్ఫబెటకల్ ఆర్డర్ ప్రకారం.. ఆమె మాట్లాడే సమయం మధ్యాహ్నం లంచ్ తరువాత వస్తుంది. కానీ ఆమె త్వరగా తిరిగి వెళ్లాలని కోరడంతో ఆమెకు ఏడవ స్పీకర్ గా అవకాశం ఇచ్చారు.” అని కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో చెప్పింది.

ఆ తరువాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా మమతా బెనర్జీ ఆరోపణలపై మాట్లాడారు. ”మేమంతా మీటింగ్ లో ఉన్నాం. మమతా బెనర్జీకి మాట్లాడే అవకాశం ఇచ్చాం. ఆమె మీడియా ముందు తన మైక్ మ్యూట్ చేశారని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది పూర్తిగా అబద్ధం. ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఆమె ఇలా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఆమె నిజం మాత్రమే చెప్పాలి.. అంతే కానీ అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేయకూడదు,” అని సీతారామన్ అన్నారు.


‘చంద్రబాబు 20 నిమిషాలు మాట్లాడారు.. మరి నాకంత సమయం ఎందుకివ్వలేదు’
నీతి ఆయోగ్ మీటింగ్ లో నుంచి బయటికొచ్చాక మమత బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ..”నేను నీతి ఆయోగ్ మీటింగ్‌ను బహిష్కరిస్తున్నాను. చంద్రబాబు నాయుడు మాట్లాడడానికి 20 నిమిషాలు కేటాయించారు. అస్సాం, గోవా, ఛత్తీస్ గడ్ సిఎంలకు 12 నిమిషాలిచ్చారు. నేను 5 నిమిషాలు కూడా మాట్లాడకముందే నన్ను ఆపేశారు. నా మైక్ మ్యూట్ చేశారు. ఇది అన్యాయం. నేను మాత్రమే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రిని. మిగతా ఎవరూ రాలేదు. వారంతా మీటింగ్ ని బహిష్కరించారు. అయినా నేను కలిసి పనిచేసందుకు వచ్చాను. నేను వచ్చినందుకు సంతోషించాలి. బడ్జెట్ లో కూడా ఇలాగే చేశారు. ఇది రాజకీయ బడ్జెట్. రాష్ట్రాల పట్ల ఈ వివక్ష ఎందుకు చేస్తున్నారు. ఇది నాకు జరిగిన అవమానం కాదు. ప్రాంతీయ పార్టీలకు జరిగిన అవమానం. అయినా నీతి ఆయోగ్ కు ఎలాంటి అధికారాలు లేవు. అలా అయితే ప్లానింగ్ కమిషన్ విధానమే మళ్లీ తీసుకురావాలి,” అని బెంగాల్ సిఎం ఫైర్ అయ్యారు.

Also Read: లండన్ వీసా మాయలో మోసపోయిన మహిళ.. డబ్బులు దోచుకొని సామూహిక అత్యాచారం చేసిన ఏజెంట్లు

Related News

kolkatta doctor case: కోల్ కతా డాక్టర్ కేసులో కీలక ఆధారాలు లభ్యం..ఆ రాత్రి బాత్ రూమ్ లో స్నానం చేసిందెవరు?

Lucknow Building collaps : యూపీలో ఘోర ప్రమాదం.. కూలిన బిల్డింగ్.. ఐదుగురు మృతి

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Big Stories

×