Central Minister Hardeep Singh puri: సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి కూడా బీజేపీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన విషయం తెలిసిందే. వీటిపై ఇండియా కూటమి స్పందిస్తూ అదంతా అబద్ధం అంటూ కొట్టి పారేస్తూ తామే అధికారంలోకి రాబోతున్నామంటూ ధీమాను వ్యక్తం చేస్తోంది. 295 స్థానాలకు పైగా తమ కూటమి సొంతం చేసుకోనున్నదంటూ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. అయితే, ఖర్గే వ్యాఖ్యలపై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురీ పలు వ్యాఖ్యలు చేశారు.
Also Read: సిక్కింలో రెండోసారి అధికారంలోకి SKM.. గురువును మళ్లీ ఓడించిన శిష్యుడు
ఇండియా కూటమి గెలుస్తుందంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పెట్టుకున్న ఆశలు త్వరలో ఆవిరి కాబోతున్నాయన్నారు. ఖర్గే ప్రస్తుతం భ్రమలో ఉన్నారన్నారు. కొన్ని గంటల్లో ఆయన వాస్తవాల్లోకి వస్తారన్నారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా బీజేపీ విజయాన్నే చూపిస్తున్నాయి… జూన్ 4న అదే నిజం కానున్నదంటూ ఆయన ఆ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈసారి 340 పైగా స్థానాలను తమ పార్టీ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇటు ఆమ్ ఆద్మీపై కూడా ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కూడా ఆప్ తుడిచిపెట్టుకుపోతుందన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వయసు చాలా చిన్నది.. ఆయన ఎదురుచూడటానికి ఇంకా 2029, 2034 ఎన్నికలు ఉన్నాయంటూ కేంద్రమంత్రి వ్యంగ్యంగా మాట్లాడారు.