EPAPER

Amit Shah : “వయనాడ్ విపత్తుపై ముందే హెచ్చరించాం”

Amit Shah : “వయనాడ్ విపత్తుపై ముందే హెచ్చరించాం”

Home Minister Amit Shah on Wayanad Tragedy : వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకూ 180 మంది మరణించగా 130 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. మృతుల్లో 75 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఘటనా ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మధ్యలో వర్షం పడుతుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది.


తాజాగా వయనాడ్ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. కేరళలో చోటుచేసుకున్న తాజా పరిణామాలపై రాజ్యసభలో ఓ ప్రకటన చేశారాయన. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉందని ముందే హెచ్చరించామని, జూలై 23నే అప్రమత్తం చేసినా.. కేరళ ప్రభుత్వం మాత్రం తమ రాష్ట్ర పౌరులను సకాలంలో తరలించలేదని తెలిపారు. కేరళలో భారీవర్షాలు మొదలవ్వగానే 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించామని చెప్పారు.

Also Read : వయనాడ్ వెళ్తుండగా మంత్రి కారుకి ప్రమాదం.. స్వల్ప గాయాలు


ప్రకృతి వైపరీత్యాల గురించి వారంరోజుల ముందుగానే హెచ్చరించే వ్యవస్థ భారత్ లో ఉందన్నారాయన. ప్రపంచంలో ఇలాంటి సాంకేతికత ఉన్న 4 దేశాల్లో మనదేశం ఒకటని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కేరళకు చేరుకున్న వెంటనే అప్రమత్తమై.. ఆ ప్రాంతవాసుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లైతే.. వయనాడ్ ఇంతటి విషాదాన్ని చూసేది కాదన్నారు అమిత్ షా. ఈ ప్రమాదంతో తీరని విషాదంలో ఉన్న కేరళ ప్రజలకు.. మోదీ సర్కార్ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×