EPAPER

Akhilesh Yadav: అఖిలేశ్‌ యాదవ్ కు సీబీఐ నోటీసులు.. తెరపైకి మైనింగ్ కేసు..

Akhilesh Yadav: అఖిలేశ్‌ యాదవ్ కు సీబీఐ నోటీసులు.. తెరపైకి మైనింగ్ కేసు..

akhilesh yadav


CBI Summons To Akhilesh Yadav: ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ కు సీబీఐ నోటీసులు ఇచ్చింది. యూపీలో జరిగిన అక్రమ మైనింగ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ చేస్తోంది. ఈ కేసులో అఖిలేశ్ ను సాక్షిగా సీబీఐ పేర్కొంది. ఈ నేపథ్యంలో విచారణ రావాలని సమన్లు జారీ చేసింది. గురువారం ఆయనను ప్రశ్నిస్తామని సీబీఐ వర్గాలు వెల్లడించాయి.

యూపీలో అక్రమ మైనింగ్ వ్యవహారం దుమారం రేపుతోంది. ఆ రాష్ట్రంలోని 7 జిల్లాల్లో మైన్ల కేటాయింపులో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు వచ్చాయి. ఆయా జిల్లాల్లో ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. అఖిలేశ్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2012-2016 మధ్య గనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ప్రధాన అభియోగం. రూల్స్ ను అతిక్రమించి అధికారులు గనులు కేటాంపులు చేశారని ఆరోపణలు వచ్చాయి.


Read More: హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం.. సీఎం రాజీనామా..!

2012- 2017 మధ్య అఖిలేశ్ యాదవ్ యూపీ సీఎంగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏడాదిపాటు మైనింగ్ శాఖ ఆయన చేతుల్లో ఉంది. ఆ బాధ్యతలు అఖిలేశే పర్యవేక్షించారు. అందువల్లే సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుణ్ని టార్గెట్ చేస్తూ సీబీఐ నోటీసులు ఇచ్చింది.

ఇసుక తవ్వకాలకు సంబంధించి అలహాబాద్ హైకోర్టు రిఫర్ చేసిన కేసులో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌ను సీబీఐ తమ ఎదుట హాజరు కావాలని బుధవారం కోరింది. ఫిబ్రవరి 29న ఢిల్లీలో సీబీఐ కార్యాలయానికి రావాలని నోటీసులు ఇచ్చింది.

అఖిలేశ్ యాదవ్ కు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ సెక్షన్ ఏదైనా కేసు విచారణకు సాక్షులను పిలవడానికి పోలీసు అధికారికి అనుమతిస్తుంది. ఈ-టెండరింగ్ ప్రక్రియను ఉల్లంఘించి మైనింగ్ లీజులిచ్చారని ఈ కేసులో ప్రధాన ఆరోపణలు. మైనింగ్ అక్రమాలపై విచారణకు గతంలోనే అలహాబాద్ హైకోర్టు విచారణకు ఆదేశించింది.

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడిన వేళ అఖిలేశ్ యాదవ్ కు సీబీఐ నోటీసులు జారీ చేయడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఇండియా కూటమి సమాజ్ వాదీ పార్టీ భాగస్వామిగా ఉంది. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ లో కాంగ్రెస్ తో అవగాహన కుదిరింది. ఎంపీ సీట్ల పంపకాలపై కాంగ్రెస్, ఎస్పీ మధ్య సయోధ్య కుదిరింది. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర యూపీలో సాగుతున్న సమయంలోనే సీట్ల కేటాయింపులపై ఇరుపార్టీలు అవగాహన వచ్చాయి.

కాంగ్రెస్ , ఎస్పీల మధ్య సీట్ల ఒప్పందం కుదిరిన తర్వాత సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ కాంగ్రెస్ భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. ఆగ్రాలో రాహుల్ గాంధీ యాత్ర సాగిస్తున్న సమయంలో హాజరయ్యారు. రాహుల్ గాంధీ, అఖిలేశ్ చేతులు కలిపారు. ఇలా కాంగ్రెస్, ఎస్పీల మధ్య ఎంపీ సీట్ల పంపకాలు సజావుగా సాగాయి. ఇక యూపీ బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు సీబీఐ అఖిలేశ్ కు నోటీసులు ఇవ్వడంపై రాజకీయ దుమారం రేగుతోంది.

Related News

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Jammu and Kashmir Assembly Polls: జమ్మూకాశ్మీర్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల

Mumbai times tower: ముంబై.. మంటల్లో టైమ్స్ టవర్, భారీగా నష్టం

Big Stories

×