BigTV English
Advertisement

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. మనీశ్ సిసోడియాకు మళ్లీ నోటీసులు

Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. మనీశ్ సిసోడియాకు మళ్లీ నోటీసులు

Manish Sisodia: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తాజాగా ఢిల్లీ డిప్యూటీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 19న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ కేసులో తాజాగా దొరికిన ఆధారాలపై ప్రశ్నించేందుకు మనీశ్ సిసోడియాకు నోటీసులు జారీ చేసినట్లు సీబీఐ వెల్లడించింది.


కాగా, ఈ కేసులో సిసోడియాను గతేడాది అక్టోబర్‌లో సీబీఐ విచారించింది. దాదాపు తొమ్మిది గంటలపాటు అధికారులు ఆయన్ను విచారించారు. ఇప్పటి వరకు ఈ కేసులో సిసోడియా సన్నిహితుడు విజయ్ నాయర్‌తో పాటు అభిషేక్ బోయినపల్లి, బినోయ్ బాబు, శరత్ చంద్రారెడ్డి, సమీర్ మహేంద్రులపై సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.

ఇక సీబీఐ నోటీసులు పంపించడంపై మనీశ్ సిసోడియా స్పందించారు. లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ తనకు మరోసారి నోటీసులు జారీ చేసిందని తెలిపారు. గతంలో కూడా తన ఇంట్లో, బ్యాంక్ లాకర్‌నూ తనిఖీ చేసినప్పటికీ.. వారికి ఎటువంటి ఆధారాలు దొరకలేదన్నారు. పిల్లలకు ఉత్తమ విద్యను అందించాలని తాను ప్రయత్నిస్తుంటే.. కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. సీబీఐ విచారణకు పూర్తిగా సహకరిస్తానని స్పష్టం చేశారు.


Related News

150 Years of Vande Mataram: వందేమాతరం గీతానికి 150 ఏళ్లు.. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక గానం

Bihar election 2025: బీహార్‌లో ప్రశాంతంగా ముగిసిన తొలి విడత పోలింగ్.. 5 గంటల వరకు 60.13% నమోదు

Viral Video: ఎయిర్ షో కాదు.. బీహార్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన హెలికాప్టర్లు, వీడియో చూస్తే షాకే!

Bilaspur: బిలాస్‌పుర్‌లో ఓకే ట్రాక్‌పై మూడు రైళ్లు.. అప్రమత్తమైన లోకోపైలట్లు.. తప్పిన ప్రమాదం!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి

Pawan Vijay: పవన్ చేసిన ధైర్యం విజయ్ చేయలేక పోతున్నారా?

Project Vishnu: భారత్ బ్రహ్మాస్త్రం రెడీ.. విష్ణు మిసైల్ స్పెషాలిటీస్ ఇవే..

Vote Chori: ఓటు చోరీ వ్యవహారం.. రంగంలోకి బ్రెజిల్ మోడల్ లారిస్సా, ఇంతకీ మోడల్ ఏమంది?

Big Stories

×