Budget 2023: భారతీయులు అందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సిద్ధమయ్యారు. ఈసారి కూడా పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అయితే దేశ ఆర్థిక రంగాన్ని ముందుకు తీసుకెళ్లడానికి నిర్మలా సీతారమన్ ఎలాంటి ప్రతిపాదనలు చేయబోతున్నారనే దానిపై అందరిలో ఉత్కంఠ నెలకొంది.
కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న సమయంలో ఉక్రెయిన్, రష్యా యుద్ధం నెలకొనడం.. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు నెలకొన్న సమయంలో బడ్జెట్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఏడాదిలోనే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024లో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే పూర్తి స్థాయి చివరి బడ్జెట్ ఇదే కానుంది.
ఉదయం 11 గంటలకు లోక్సభలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈక్రమంలో నిర్మలా సీతారామన్ రాష్ట్రపతి భవన్కు వెళ్లారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి బడ్జెట్ను వివరించారు.