Bride: పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధురమైన ఘట్టం. ఈ వేడుకను జీవితాంతం గుర్తిండిపోయేలా చేసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. ఇందుకోసం వినూత్న ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ మధ్యకాలంలో చాలా మంది డెస్టినేషన్ మ్యారేజ్లను ఎక్కువగా చేసుకుంటున్నారు. అత్యంత సన్నిహితుల సమక్షంలో వేడుకను వైభవంగా జరుపుకుంటున్నారు.
తాజాగా కర్ణాటకకు చెందిన ఓ వధువు కోటి ఆశలతో పెళ్లిపీటలెక్కేందుకు ముస్తాబు అయింది. ఇంటి వద్ద నుంచి కారులో కళ్యాణ మండపానికి బయల్దేరింది. అయితే మధ్యలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడంతో ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. మహూర్తం సమయానికి కళ్యాణ మండపానికి చేరుకోవాలని చివరికి మెట్రో రైలును ఆశ్రయించింది. ట్రైన్లో తగిన సమయానికి కళ్యాణ మండపానికి చేరుకుంది.
అయితే వధువు మెట్రో ట్రైన్లో పెళ్లి కుమార్తెగా ముస్తాబై ప్రయాణిస్తుండగా ఓ వ్యక్తి వీడియో తీశాడు. దానిని వాట్ ఏ బ్రైడ్ పేరిట సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట్లో వైరలవుతోంది. కొద్ది క్షణాల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయి.