EPAPER

Boeing 747 : బోయింగ్ 747.. నేటికీ క్వీనే

Boeing 747 : బోయింగ్ 747.. నేటికీ క్వీనే

boeing 747: ‘క్వీన్ ఆఫ్ ది స్కైస్’గా బోయింగ్ 747 విమానాలకు పేరుంది. నిరుడు డిసెంబర్ 31 నాటికే ఈ విమానాలకు గుడ్‌బై చెప్పేసింది బోయింగ్ సంస్థ. దాదాపు 5 దశాబ్దాల పాటు విమానయానరంగాన్ని 747 విమానాలే శాసించాయి. గత 50 ఏళ్లలో 1500 విమానాలను తయారు చేశారు.


747 తయారీ నిలిచిపోయినా.. ఇంకా 440 విమానాలు సేవలందిస్తున్నాయి. తొలి బోయింగ్ 747 విమానం జనవరి 22, 1970 న్యూయార్క్ నుంచి టేకాఫ్ తీసుకుంది. చిట్టచివరి విమానాన్ని నిరుడు ఫిబ్రవరి 1న అట్లాస్ ఎయిర్‌కు డెలివరీ చేశారు. ఆగస్టు నాటికి 440 విమానాలు ఇంకా ప్రయాణికులను చేరవేస్తూనే ఉన్నాయి.

బోయింగ్ 747 ద్వారా అత్యధిక సంఖ్యలో ప్రయాణికులను చేరవేస్తున్న విమానయాన సంస్థగా లుఫ్తాన్సాకు పేరుంది. ఆ సంస్థ వద్ద 747 విమానాలు 27 ఉన్నాయి. ఇక ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న 747 విమానాల్లో అత్యధిక భాగం అట్లాస్ ఎయిర్ వద్దే ఉన్నాయి. ఆ సంస్థ ఫ్లీట్‌లో వీటి సంఖ్య 52.


కార్గో ఎయిర్‌లైనర్లలో ఇప్పటికీ 747 విమానాలకు డిమాండ్ విపరీతంగా ఉంది. ఏరియల్ ఫ్రైట్ స్పెషలిస్టులైన యూపీఎస్ ఎయిర్ లైన్స్ వద్ద 41, కార్గో‌ఫ్లక్స్ వద్ద 29 విమానాలు సర్వీసులో ఉన్నాయి. అమెరికా కార్గో ఎయిర్ లైన్ సంస్థ కలిటా ఎయిర్ వద్ద 24 విమానాలు ఇప్పటికీ సేవలు అందిస్తున్నాయి.

ఆసియాలో ప్యాసింజర్ ఎయిర్‌లైన్స్‌గా బోయింగ్ 747 స్థానం చెక్కుచెదరలేదు. హాంకాంగ్‌కు చెందిన క్యాథే పసిఫిక్, దక్షిణ కొరియాకు చెందిన కొరియన్ ఎయిర్ వద్ద 20 విమానాల చొప్పున సర్వీసులో ఉన్నాయి.

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×