BJP Second List Released for Elections 2024: 72 మంది అభ్యర్థులతో బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ప్రకటించగా.. రెండో జాబితాలో ఆరుగురు పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించింది అధిష్ఠానం.
మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రఘునందన్ రావు, మహబూబాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా సీతారాం నాయక్, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ గోడం నగేష్, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్, నల్గొండ ఎంపీ అభ్యర్థిగా సైదిరెడ్డి లను ప్రకటించింది. ఇంకా వరంగల్, ఖమ్మం స్థానాల అభ్యర్థులను పెండింగ్ లో ఉంచింది. ఇప్పటి వరకూ తెలంగాణలో 15 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Also Read: Amit Shah on CAA : సీఏఏను ఎప్పటికీ వెనక్కి తీసుకోం : హోం మంత్రి అమిత్ షా
రెండో జాబితాలో ప్రకటించిన సైదిరెడ్డి, గోడెం నగేశ్, సీతారాం నాయక్ ఇటీవలే బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. కాగా.. తొలి జాబితాలో 195 మంది పేర్లను ప్రకటించిన బీజేపీ.. రెండో జాబితాలో 72 మంది అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ 6, దాద్రా నగర్ హవేలీ 1, ఢిల్లీ 2, గుజరాత్ 7, హర్యానా 6, హిమాచల్ ప్రదేశ్ 2, కర్ణాటక 20, మధ్యప్రదేశ్ 5, మహారాష్ట్ర 20, త్రిపుర 1, ఉత్తరాఖండ్ 2 చొప్పున అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.