Electoral Bonds Scheme income to BJP: అధికార భారతీయ జనతా పార్టీ(BJP) 2022-23లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా దాదాపు ₹1300 కోట్లు పొందింది. కాంగ్రెస్ అదే మార్గంలో పొందిన దాని కంటే ఏడు రెట్లు ఎక్కువ.
2022-23 ఆర్థిక సంవత్సరంలో BJP మొత్తం విరాళాలు ₹2120 కోట్లుగా ఉన్నాయి. వీటిలో 61 శాతం ఎలక్టోరల్ బాండ్ల నుండి వచ్చినవే అని పార్టీ ఎన్నికల కమిషన్కు సమర్పించిన వార్షిక ఆడిట్ నివేదిలో పేర్కొంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పార్టీ మొత్తం విరాళాలు ₹ 1775 కోట్లు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో పార్టీ ఆదాయం ₹1917 కోట్లగా ఉండగా.. 2022-23లో పార్టీ మొత్తం ఆదాయం ₹2360.8 కోట్లకు పెరిగింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో ₹236 కోట్లగా ఉన్న కాంగ్రెస్ ఎలక్టోరల్ బాండ్ల విలువ.. 2022-23లో ₹171 కోట్లకు తగ్గింది.
Read More: 17వ లోక్ సభ.. మోదీ చివరి స్పీచ్..
బీజేపీ, కాంగ్రెస్లు జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాయి. ఇక రాష్ట్ర పార్టీ విషయాలకొస్తే.. సమాజ్ వాదీ పార్టీ, 2021-22లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ₹3.2 కోట్లు సంపాదించింది. 2022-23లో, ఈ బాండ్ల నుండి దీనికి ఎటువంటి విరాళాలు రాలేదు.
మరో రాష్ట్ర పార్టీ టీడీపీ 2022-23లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ₹34 కోట్లు సంపాదించింది, ఇది గత ఆర్థిక సంవత్సరం కంటే 10 రెట్లు పెరిగింది.
బీజేపీ కేవలం వడ్డీల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో ₹237 కోట్లు సంపాదించింది. 2021-22లో ఇది ₹135 కోట్లుగా ఉంది.
బీజేపీ మొత్తం వ్యయంలో, ఎన్నికల ప్రచారం, సాధారణ ప్రచారంపై విమానాలు, హెలికాప్టర్ల వినియోగానికి BJP ₹78.2 కోట్లు చెల్లించింది, ఇది 2021-22లో ₹117.4 కోట్లుగా ఉంది.
2022-23లో పార్టీ అభ్యర్థులకు ఆర్థిక సహాయంగా ₹76.5 కోట్లు చెల్లించింది. 2021-22లో ఇది ₹ 146.4 కోట్లుగా నమోదయ్యింది. ‘మొత్తం చెల్లింపులు’ శీర్షిక కింద పార్టీ ఈ సహాయాన్ని చూపింది.