పోలీసు అధికారిపై బీజేపీ ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకొంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ పుణెలోని సాసూన్ ఆస్పత్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అజిత్ పవార్తోపాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ప్రోగామ్ కు హాజరయ్యారు. వేదిక నుంచి కిందకు దిగుతున్న బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కాంబ్లే పట్టు కోల్పోయి కింద పడబోయారు.
దీంతో ఆయన పక్కనే ఉన్న పోలీసు చెంపపై కొట్టారు. సునీల్ కాంబ్లే పుణె కంటోన్మెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పోలీసుపై ఆయన చర్యను ప్రజలు విమర్శిస్తున్నారు. కార్యక్రమానికి ఆహ్వానించే పత్రికలో తన పేరు లేకపోవడమే కోపానికి కారణమని అందువల్లే సహనం కోల్పోయి ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది