BJP Appointed Incharges to Four States : బీజేపీ అధిష్ఠానం నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జులను నియమించింది. నలుగురు కేంద్రమంత్రుల్ని నాలుగు రాష్ట్రాలకు ఇన్ఛార్జులుగా నియమిస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.
జమ్ముకశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని, మహారాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్, మహారాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్, హర్యానా ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్ లను నియమించింది. అలాగే.. ఝార్ఖండ్ కు శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత బిశ్వా శర్మలను నియమించింది.
ఇటీవలే కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. ముచ్చటగా మూడోసారి ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేసి.. బాధ్యతలు స్వీకరించారు. లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ.. ఇప్పుడు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించింది. జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం ఎన్నికల ఇన్ఛార్జులను నియమించింది.
కేంద్ర మంత్రులకు ఇంఛార్జి బాధ్యతలు
నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇంఛార్జిలను నియమించిన
బీజేపీజమ్మూకశ్మీర్ ఎన్నికల ఇంఛార్జ్గా కిషన్రెడ్డి
హర్యానా ఇంఛార్జ్గా ధర్మేంద్ర ప్రధాన్, బిప్లవ్ దేవ్
మహారాష్ట్ర ఇంఛార్జ్గా అశ్వినీ వైష్ణవ్, భూపేంద్రయాదవ్
ఝార్ఖండ్ ఇంఛార్జ్గా శివరాజ్… pic.twitter.com/nx7kNRbVXw
— BIG TV Breaking News (@bigtvtelugu) June 17, 2024