Bharat Jodo Nyay Yatra | కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ల గాంధీ నాయకత్వంలో ఇటీవల భారత్ జోడో న్యాయ యాత్రం ప్రారంభమైంది. ఈ యాత్రలో జనవరి 20 ఆదివారం కాంగ్రెస్ సిబ్బంది, కీలక నాయకుడు జై రామ్ రమేశ్ కారుపై బిజేపీ కార్యకర్తలు దాడి చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. ఈ ఘటన అస్సాం లోని సోనిత్పూర్ జిల్లాలో జరిగింది.
Bharat Jodo Nyay Yatra | కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ల గాంధీ నాయకత్వంలో ఇటీవల భారత్ జోడో న్యాయ యాత్రం ప్రారంభమైంది. ఈ యాత్రలో జనవరి 20 ఆదివారం కాంగ్రెస్ సిబ్బంది, కీలక నాయకుడు జై రామ్ రమేశ్ కారుపై బిజేపీ కార్యకర్తలు దాడి చేశారని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. ఈ ఘటన అస్సాం లోని సోనిత్పూర్ జిల్లాలో జరిగింది.
భారత్ జోడో న్యాయ యాత్ర నాలుగవ రోజున రాహుల్ గాంధీ అస్సంలోని బిస్వంత్ జిల్లా నుంచి బయలుదేరి సోనిత్పూర్ మీదుగా నాగావ్ చేరుకోవాలి. కాంగ్రెస్ బృందం నాగావ్ జిల్లా చేరుకొని అక్కడ రాహుల్ గాంధీ కలియబోర్లో ఒక ర్యాలీ నిర్వహించాల్సి ఉండగా.. అంతకుముందే బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని సమాచారం.
కాంగ్రెస్ నాయకులు కథనం ప్రకారం.. రాహుల్ గాంధీ వెళ్లే మార్గంలోనే బీజేపీ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ఆ దారిలో కొందరు కాంగ్రెస్ నాయకుల వాహనాలు జాముగురిహట్ పక్క నుంచి వెళుతుండగా.. కొందరు బీజీపీ కార్యకర్తలు ఆ వాహనాలపై రాళ్లు విసిరారు. ఇందులో కాంగ్రెస్ అగ్రనేత జైరామ్ రమేష్ కారు కూడా ఉంది. ఈ దాడిలో కొందరు మీడియా రిపోర్టర్లు కూడా గాయపడ్డారు. బిజేపీ కార్యకర్తలు వారి కెమెరాలు లాక్కొని వాటిని ధ్వంసం చేశారని చెబుతున్నారు.
ఆ తరువాత కూడా బీజేపీ కార్యకర్తలు కార్లపై ఉన్న భారత్ జోడో యాత్ర పోస్టర్లను చింపేశారు. పైగా కార్ల వెనుక భాగంలో బీజేపీ జెండాలను పాతారు.ఇదంతా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాస్ శర్మ ఆదేశాలతోనే జరిగిందని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది.
అయితే ఈ ఘటనపై విచారణ చేయాలని సిఎం హిమంత రాష్ట్ర డిజీపీకి ఆదేశాలు జారీ చేశారు.