Bihar Major Road Accident : బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వైషాలీ నగర సమీపంలోని మహ్నర్ లో….. పాదచారులపైకి ట్రక్కు దూసుకెళ్లింది. దీంతో పన్నెండు మంది అక్కడికక్కడే చనిపోయారు. వీరిలో చిన్నారులు ఎక్కువ మంది ఉన్నారు. మద్యం మత్తులో ట్రక్కు నడిపంచాడా లేదా బ్రేక్ ఫెయిల్ అయ్యిందా లేదంటే అతి వేగం వల్ల ప్రమాదం జరిగిందా అనేదానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ట్రక్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబసభ్యుల రోదనలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. విచారంపై ప్రధాని మోది దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్గ్రేషియా, గాయ పడిన వారికి 50వేలను ప్రకటించారు ప్రధాని మోదీ.
ఈ దుర్ఘటనపై రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జరిగిన ప్రమాదం బాగా కలచివేస్తుందని అన్నారు. స్థానిక ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రౌషన్ ప్రమాదం జరిగిన వెంటనే సంఘనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే స్పాట్లో 9 మంది అక్కడిక్కడే మృతి చెందారు. పెళ్లికి సంబంధించిన వేడుక జరుగుతున్నప్పుడు ట్రక్ అక్కడున్న వారిపై దూసుకెళ్లిందని వైషాలి నగర ఎస్పి తెలిపారు.