Bihar: బీహార్లోని మాధేపురాలో విచిత్ర సంఘటన జరిగింది. భార్యకాపురానికి రావడం లేదని ఓ వ్యక్తి మర్మాంగాన్ని కోసుకున్నాడు. రజ్నీనాయనగర్కు చెందిన కృష్ణ(25) అనే వ్యక్తికి అనిత అనే యువతితో వివాహం జరిగింది. కృష్ణ ఉద్యోగరిత్యా పంజాబ్లో ఉంటుండగా.. అనిత పిల్లలతో కలిసి సొంతూరులోనే జీవిస్తుంది. ఇటీవల కృష్ణ సొంతూరుకు వెళ్లగా.. అప్పటికే అనిత పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది.
అయితే కాపురానికి రావాలంటూ కృష్ణ పలుమార్లు చెప్పినప్పటికీ అనిత అందుకు నిరాకరించింది. దీంతో భార్య రావడం లేదని కృష్ణ మనస్తానికి గురయ్యాడు. కోపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో తన మర్మాంగాన్ని కోసుకున్నాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కృష్ణ మాధేపురాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.