Bihar Bridge Collapse : ప్రారంభోత్సవానికి ముందే వంతెన కూలిపోయింది. అట్లుంటది మరి మన ఇంజినీర్లు, కాంట్రాక్టుల పనితనం. కమీషన్లకు కక్కుర్తి పడి నాసిరకంగా నిర్మిస్తే ప్రారంభానికి ముందేం కర్మ కట్టకముందే కూలిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. బిహార్లో ఓ బ్రిడ్జి ఇలానే ప్రారంభానికి ముందే కుప్ప కూలిపోయింది. బ్రిడ్జిపై వాహనాలు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
బిహార్లోని బెగూసరాయ్లో గండక్ నదిపై 2017లో ఈ వంతెనను నిర్మించారు. మా భగవతి సంస్థ ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టింది. దీనికి 13 కోట్లు ఖర్చు చేశారు. కానీ అప్రోచ్ రోడ్డు లేకపోవడం వల్ల.. ఈ వంతెనకు ప్రారంభోత్సవం నిర్వహించలేదు. ఆఫీషియల్గా ఇంకా ప్రారంభించకపోయినా బ్రిడ్జిపై వాహన రాకపోకలు మత్రం సాగుతున్నాయి. బ్రిడ్జి నిర్మించి ఐదేళ్లు కూడా కాకముందే కుప్పకూలిపోయింది.
ఆ సమయంలో వంతెనపై వాహనాలు లేనందున పెద్ద ప్రమాదం తప్పిపోయిందని స్థానికులు అంటున్నారు. వంతెన నిర్మించిన కాంట్రాక్టర్ను వెంటనే అరెస్టు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వంతెన నిర్మాణంలో భారీ దోపిడీ జరిగిందని ఆరోపిస్తున్నారు.