High court denied bail to Senthil Balaji: తమిళనాడు మాజీ మంత్రి వి సెంథిల్ బాలాజీపై జరుగుతున్న మనీలాండరింగ్ విచారణలో మద్రాస్ హైకోర్టు బుధవారం బెయిల్ నిరాకరించింది. బాలాజీ బెయిల్ పిటిషన్పై గతవారం ఉత్తర్వులను కోర్టు రిజర్వ్లో ఉంచింది. 2023 అక్టోబర్ 19న బాలాజీ ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
బాలాజీ అంతకుముందు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం హయాంలో మంత్రిగా పని చేశారు. క్యాష్ ఫర్ జాబ్స్ మనీలాండరింగ్ కేసులో బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గత ఏడాది జూన్లో అరెస్టు చేసింది. బాలాజీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లో ఎలాంటి మెరిట్లు లేవని జస్టిస్ ఆనంద్ వెంకటేష్ బుధవారం తెలిపారు.
Read More: అంబానీ కొడుకు పెళ్లి వంటకాల ఒక్కో ప్లేట్ ఎంతో తెలుసా?
అయితే బాలాజీ 8 నెలలకుపైగా జైలులో ఉన్నందున ఈ కేసులో విచారణను 3 నెలల్లోగా పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. విచారణ మార్గదర్శకాలకు అనుగుణంగా రోజువారీ ప్రాతిపదికన నిర్వహిస్తారు. మరోవైపు బెయిల్ను పరిగణనలోకి తీసుకునే దశలో కోర్టు మినీ విచారణ జరపలేదు.
బాలాజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ.. అతను ఎమ్మెల్యేగా ఉన్నారని, సాక్షులను ప్రభావితం చేయగలరని ఈడీ వాదించింది. బాలాజీ సమాజానికి వ్యతిరేకంగా నేరానికి పాల్పడ్డారని కొంతమంది అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించడం ద్వారా ఇతర అభ్యర్థుల స్థాయిని ప్రభావితం చేశారని. తద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం వారి హక్కులను ఉల్లంఘించారని ఈడీ చెప్పింది.
Read More: హిమాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం.. సీఎం రాజీనామా..!
సాక్ష్యాలను తారుమారు చేయడంపై బాలాజీ చేసిన వాదనను కోర్టు తోసిపుచ్చింది. అరెస్టు చేసిన తర్వాత కూడా 8 నెలల పాటు మంత్రిగా కొనసాగారని.. బాలాజీ ప్రభావవంతమైన వ్యక్తి అని, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది.