Azim Premji : ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వాటా నుంచి 1.02 కోట్ల ఈక్విటీ షేర్ల ను తన ఇద్దరు కుమారులకు బదిలీ చేశారు. వీటి విలువ రూ.480 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ షేర్లను బహుమతిగా ఇచ్చినట్లు కంపెనీ తమ రెగ్యులేటరీ ఫైలింగ్లో ప్రకటించింది.
Azim Premji : ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వాటా నుంచి 1.02 కోట్ల ఈక్విటీ షేర్లను తన ఇద్దరు కుమారులకు బదిలీ చేశారు. వీటి విలువ రూ.480 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఈ షేర్లను బహుమతిగా ఇచ్చినట్లు కంపెనీ తమ రెగ్యులేటరీ ఫైలింగ్లో ప్రకటించింది.
విప్రో సంస్థలో అజీమ్ ప్రేమ్జీ 22.58కోట్ల షేర్లతో 4.32శాతం వాటాను కలిగి ఉన్నారు. దీనిలో నుంచి 0.20శాతం వాటాను తన కుమారులు రిషద్ ప్రేమ్జీ మరియు తారిఖ్ ప్రేమ్జీకు సమానంగా బదిలీ చేశారు. అజీమ్ ప్రేమ్జీ మొత్తం 1.02 కోట్ల షేర్లను కానుకగా ఇచ్చారు. విప్రో షేరు ధర ప్రస్తుతం రూ.472.9 రూపాయలుగా ఉంది. ఆ లెక్కన దాదాపు రూ.483 కోట్ల రూపాయలను అజీమ్ తన వారసులకు గిఫ్ట్గా ఇచ్చారు. ఈ షేర్ల బదిలీతో కంపెనీలో ఆయన వాటా 4.32 శాతం నుంచి 4.12 శాతానికి తగ్గింది.
విప్రో సంస్థలో అజీమ్ ప్రేమ్జీ కుటుంబం మొత్తం 4.43 శాతం వాటాని కలిగి ఉంది. ఇందులో ఆయన భార్య 0.05శాతం వాటాను కలిగి ఉంది. ఇద్దరు కుమారులు 0.13 శాతం చొప్పున షేర్లను కలిగి ఉన్నారు. ప్రస్తుతం కంపెనీకి ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా రిషద్ ప్రేమ్జీ వ్యవహరిస్తున్నారు. మరో కుమారుడు తారిఖ్ ప్రేమ్జీ ఎండోమెంట్ ఫండ్ దాతృత్వ సంస్థకు ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.