Ayodhya Ramalayam: ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య రామాలయంలో వచ్చే నెల 22న జరిగే రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రముఖులకు ఆహ్వానాలు అందుతున్నాయి. ఇదే క్రమంలో రెబల్స్టార్ ప్రభాస్కు ఆహ్వానం అందింది. ఆయనతోపాటు కేజీఎఫ్ ఫేం యశ్ సహా బాలీవుడు నటులు రణ్బీర్ కపూర్, ఆలియాభట్, అజయ్ దేవ్గణ్, సన్నీ డియోల్ సహా బాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఇటు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, చిరంజీవి, రజినీకాంత్, మోహన్లాల్, సంజయ్ లీలా బన్సాలీ, మాధురి దీక్షిత్, అనుపమ్ ఖేర్, ధనుశ్, రిషభ్ శెట్టిని కూడా ఇప్పటికే వేడుకలో పాల్గొనాలని ఆహ్వానించారు.
కాగా.. ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ – పార్ట్ 1 సీజ్ ఫైర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సక్సెస్ టాక్ సొంతం చేసుకోవడంతో.. వసూళ్లు భారీగా వస్తున్నాయి. ప్రభాస్ క్యారెక్టర్ కు కాస్త డైలాగ్స్ తగ్గాయన్న నిరాశ మినహా.. సినిమా చాలా బాగుందని ప్రేక్షకులు రివ్యూ ఇచ్చేశారు. ఫెస్టివల్ సీజన్, వరుస సెలవులు, వీకెండ్ ఇవన్నీ సలార్ కు ప్లస్ పాయింట్స్ అయ్యాయి. బాహుబలి తర్వాత.. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ లతో నిరాశ పరిచిన ప్రభాస్.. సలార్ తో ఫ్యాన్స్ అంచనాలను అందుకున్నాడు.