EPAPER

Ashish Mishra: లఖింపూర్‌ఖేరి రైతుల హత్య కేసులో ఆశిష్ మిశ్రాకు బెయిల్

Ashish Mishra: లఖింపూర్‌ఖేరి రైతుల హత్య కేసులో ఆశిష్ మిశ్రాకు బెయిల్

Ashish Mishra: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన లఖింపూర్‌‌ఖేరి రైతుల హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుడు, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 8 వారాల పాటు బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది. జస్టిస్ సూర్యకాంత్, జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేశారు.


బెయిల్ సమయంలో ఆశిష్ యూపీ, ఢిల్లీలో ఉండరాదని, వారం రోజుల్లోగా యూపీని వదిలిపెట్టి వెళ్లాలని కోర్టు ఆదేశించింది. అలాగే ఎక్కడ ఉంటున్నాడనేది ఎప్పటికప్పుడు కోర్టుకు తెలియజేయాలని సూచించింది. ఈ కేసులో సాక్ష్యుల్ని ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తే వెంటనే బెయిల్‌ను రద్దు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. తిరిగి బెయిల్ పిటిషన్‌పై మార్చి 14న విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది.

2021లో లఖింపూర్‌ఖేరిలో రైతులు ధర్నా చేస్తుండగా ఆశిష్ మిశ్రా వారిపైకి కారుతో దూసుకెళ్లాడు. ఈఘటనలో నలుగురు రైతులు అక్కడికక్కే ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. దీంతో ఆశిష్ మిశ్రాపై మర్డర్ కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.


Related News

Kalinga Movie: నన్ను పద్దు పద్దు అని పిలుస్తుంటే హ్యాపీగా ఉంది: ‘కళింగ’ మూవీ హీరోయిన్ ప్రగ్యా నయన్

Honeymoon Express: ఓటీటీలోనూ రికార్డులు బ్రేక్ చేస్తున్న ‘హనీమూన్ ఎక్స్‌ప్రెస్’

Best Electric Cars: తక్కువ ధర, అదిరిపోయే రేంజ్- భారత్ లో బెస్ట్ అండ్ చీప్ 7 ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

Pod Taxi Service: భలే, ఇండియాలో పాడ్ ట్యాక్సీ పరుగులు.. ముందు ఆ నగరాల్లోనే, దీని ప్రత్యేకతలు ఇవే!

Sitaram Yechury: మరింత విషమంగా సీతారాం ఏచూరి ఆరోగ్యం

Vaginal Ring: మహిళల కోసం కొత్త గర్భనిరోధక పద్ధతి వెజైనల్ రింగ్, దీనిని వాడడం చాలా సులువు

Train Passenger Rules: రైల్లో ప్రయాణిస్తున్నారా? టీసీ ఇలా చేస్తే తప్పకుండా ప్రశ్నించవచ్చు, మీకు ఉన్న హక్కులివే!

Big Stories

×