EPAPER

PM Modi: జూన్ 4 సమీపిస్తుండటంతో ఇండియా కూటమిలో అసహనం: పీఎం మోదీ

PM Modi: జూన్ 4 సమీపిస్తుండటంతో ఇండియా కూటమిలో అసహనం: పీఎం మోదీ

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి. ఫలితాలు వెల్లడయ్యే సమయం దగ్గర పడుతుండటంతో ఇండియా కూటమిలో అసహనం పెరుగుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ నేతలు తనను దూషిస్తున్నారని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో భాగంగా బీహార్ లోని మహరాజ్ గంజ్ లో సోమవారం జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న మోదీ ప్రసంగించారు.


ఈ సందర్భంగా మోదీ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల ఫలితాల తేదీ సమీపిస్తుండటంతో వారంతా బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రజలు రాబోయే ఐదేళ్ల కోసం మరో సారి మోదీlr ఎన్నుకుంటారన్న విషయాన్ని విపక్ష నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. భవిష్యత్తు తరాల కోసం కేంద్రంలో పటిష్ట ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వికసిత్ భారత్ ఆకాంక్షలను నెరవేర్చే దిశగా మరోసారి బీజేపీ ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు.

Also Read: రాజీవ్ గాంధీ వర్థంతి.. నివాళులు అర్పించిన ప్రధాని, కాంగ్రెస్ నేతలు


కాంగ్రెస్ హయాంలో అవినీతి పెరిగిందని యూపీ సీఎం ఆదిత్యనాథ్ ఆరోపించారు. యూపీలోని సిద్దార్థ నగర్ లో సోమవారం ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ హయాంలో నాటి ప్రధాని రాజీవ్ గాంధీ స్వయంగా అవినీతి గురించి వెల్లడించారని గుర్తు చేశారు. తాము ఖర్చు చేసిన ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతోందని చెప్పారని అన్నారు. కానీ ప్రస్థుతం ఆ పరిస్థితి లేదు.. జన్ ధన్ ఖాతాల్లో నేరుగా డబ్బు ప్రజలకు చేరుతోందని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.

 

Tags

Related News

kolkatta doctor case: కోల్ కతా డాక్టర్ కేసులో కీలక ఆధారాలు లభ్యం..ఆ రాత్రి బాత్ రూమ్ లో స్నానం చేసిందెవరు?

Lucknow Building collaps : యూపీలో ఘోర ప్రమాదం.. కూలిన బిల్డింగ్.. ఐదుగురు మృతి

Minister Comments: బ్రేకింగ్ న్యూస్.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి.. తన కూతురు – అల్లుడిని నదిలో తోసేయండంటూ..

Amit Shah: ఆ విషయంలో.. పాక్‌తో చర్చలు జరిపే ఆలోచనే లేదు: అమిత్ షా

No Doctors For Jails: 5600 మంది ఖైదీలకు ఒక డాక్టర్.. జైళ్లలో నేరస్తుల ఆరోగ్యంపై నిర్లక్ష్యమా?..

Uttar Pradesh Wolf Attacks: యూపీలో తోడేళ్ల విధ్వంసం.. 8 మంది మృతి.. మంత్రి వింత వాదన!

Kolkata Rape Case CBI: కోల్‌కతా రేప్ నిందితుడికి బెయిల్?.. సిబిఐ నిర్లక్ష్యం.. మండిపడిన మమతా పార్టీ!

Big Stories

×