E-Paper
Advertisement

Arvind Kejriwal : గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ సీఎం .. మోదీ డిగ్రీ వివాదంపై రివ్యూ పిటిషన్..

Arvind Kejriwal : గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించిన ఢిల్లీ సీఎం .. మోదీ డిగ్రీ వివాదంపై రివ్యూ పిటిషన్..
Advertisement

Arvind Kejriwal on Modi(Latest political news in India) : ప్రధాని మోదీ విద్యార్హత అంశంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గుజరాత్ హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. ఈ పిల్ ను విచారణకు అంగీకరించిన న్యాయస్థానం వాదనలను జూన్ 30కి వాయిదా వేసింది. ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ వివాదంపై మార్చి 31న వెలువరించిన ఉత్తర్వులపై కేజ్రీవాల్ రివ్యూ పిటిషన్ వేశారు. మోదీ డిగ్రీ అందుబాటులో ఉందన్న గుజరాత్ వర్సిటీ వాదనలు అవాస్తమని కేజ్రీవాల్ లేవనెత్తారు.

మోదీ డిగ్రీ సర్టిఫికెట్‌ కోసం ఢిల్లీ సీఎం మొదటి సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. గుజరాత్‌ హైకోర్టు దీన్ని తప్పుపట్టి ఆయనకు ఫైన్‌ వేసింది. గుజరాత్‌ వర్సిటీ.. మోదీ డిగ్రీ సర్టిఫికెట్‌ ఆన్‌లైన్‌లో ఉందని వెల్లడించింది. అయితే సర్టిఫికెట్‌ ఆన్‌లైన్‌లో లేదని పేర్కొంటూ కేజ్రీవాల్‌ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

2016 ఏప్రిల్‌లో అప్పటి మాజీ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ శ్రీధర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. మోదీ డిగ్రీలకు సంబంధించిన సమాచారం అందించాలని ఆదేశించింది. అయితే సీఐసీ ఇచ్చిన ఆదేశాలను కోర్టు తోసిపుచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.

శుక్రవారం గుజరాత్ హైకోర్టు జస్టిస్ బీరెన్ వైష్ణవ్ విచారణకు స్వీకరించి.. ఈ నెల 30కి వాయిదా వేశారు. అనంతరం గుజరాత్ వర్సిటీ, కేంద్ర ప్రభుత్వం, మాజీ చీఫ్ ఇన్‌ఫర్మేషన్ కమిషనర్ శ్రీధర్‌కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. ప్రధాని మోదీ డిగ్రీ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని వర్సిటీ చెప్పిందని, అయితే వర్సిటీ వెబ్‌సైట్‌లో అలాంటి డిగ్రీ అందుబాటులోనే లేదని కేజ్రీవాల్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

Related News

ఢిల్లీలో భారీ వర్షాలు.. కూలిన మూడంతస్తుల భవనం

మురికి నదిని ఒంటరిగా శుభ్రం చేసిన పేద యువకుడు.. కట్ చేస్తే అంతర్జాతీయ కంపెనీ జాబ్ ఆఫర్

నిందితుడ్ని వాహనానికి కట్టేసి.. 10 నిమిషాలపాటు లాఠీకి పని చెప్పిన పోలీసులు.. ఆ నేరానికి ఇది చాలా చిన్న శిక్ష!

కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు.. ఆరు రాష్ట్రాలకు ఏఐసీసీ కొత్త నేతలు, ఏపీకి పివి మోహన్‌

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

Big Stories

Advertisement
×