Uttar Pradesh : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరును లక్షల్లో రాసి ఓ వృద్ధుడు ఆయనపై ఉన్న అభిమానాన్నిచాటుకున్నారు. ఉత్తర్ప్రదేశ్లోని అమేఠీకి చెందిన శత్రుజ్ఞ బరన్వాల్(68) అనే వృద్ధుడు మోదీ పేరును ఏకంగా 9 లక్షల 9 వేల సార్లు రాశాడు. ఇలా మోదీ పేరు రాయడానికి ఓ కారణం ఉంది అని ఆయన అన్నారు. ఆయన వ్యక్తిత్వం నాకు ఎంతగానో నచ్చింది. నా దృష్టిలో దేవుడు తర్వాత ఆయనే అని శత్రుజ్ఞ బరన్వాల్ తెలిపాడు.
“దేశానికి, సమాజానికి, మన మతానికి ఎంతో సేవ చేశారు. అయోధ్యలో రామాలయం కట్టించి ప్రాణప్రతిష్ఠలో పాల్గొంటున్నారు. నరేంద్ర మోదీ నేను మనస్పూర్తిగా అభిమానిస్తున్నాను. ప్రధానిని నేరుగా కలవాలన్నది నా కోరిక. మోదీ పేరును ఇలా లక్షలాది సార్లు రాస్తే ఆయన్ను కలిసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను’’ అని బరన్వాల్ తెలిపారు.